అన్ని జిల్లాల్లో ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’
స్వాతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోవాలన్న కలెక్టర్లు, అధికారులు
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను బుధవారం ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులు జెండా ఊపి ‘ఫ్రీడమ్ ఇండియా రన్’ను ప్రారంభించగా అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నెల 12న ఉత్సవాలు ప్రారంభం కాగా, మూడో వారం ఫ్రీడమ్ రన్ నిర్వహించినట్లు అర్బన్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకుసాగాలని కలెక్టర్లు పేర్కొన్నారు.