floods in chennai | ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు సీఎం MK స్టాలిన్ పర్యటించారు.