న్యూఢిల్లీ: జైడస్ క్యాడిలా తయారు చేసిన కరోనా టీకా ‘జైకోవ్-డీ’కి అత్యవసర వినియోగం(ఈయూఏ) కింద కేంద్రం ఈ వారంలోనే ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం. తమ టీకాకు అనుమతి కోసం జైడస్ క్యాడిలా జూలై 1న దరఖాస్తు చేసుకొన్నది. దీనిని 12-18 ఏండ్ల మధ్య వయసువారికి కూడా వేయవచ్చు. జైకోవ్-డీకి ఒకవేళ ఆమోదం లభిస్తే దేశంలో 12-18 ఏండ్ల మధ్య వయసువారికి వేసే మొదటి టీకా అవుతుంది.