Jagdeep Dhankhar: భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్సింగ్కు భారతరత్న అవార్డు ప్రకటించడంపై చర్చ సందర్భంగా శనివారం ఉదయం రాజ్యసభలో తీవ్ర రభస చోటుచేసుకుంది. ఈ చర్చలో ప్రతిపక్ష నేతకంటే ముందుగా చౌదరి చరణ్ సింగ్ మనవడు, ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరికి మాట్లాడే అవకాశం ఇవ్వడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ రూల్ ప్రకారం జయంత్కు ముందుగా మాట్లాడే అవకాశం ఇచ్చారని మల్లికార్జున్ ఖర్గే సహా కాంగ్రెస్ నేతలు చైర్మన్ను నిలదీస్తూ ఆందోళనకు దిగారు.
దాంతో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అసహనానికి లోనయ్యారు. చౌదరి చరణ్సింగ్ను, ఆయన వారసత్వాన్ని మీరు అవమానిస్తున్నారంటూ మల్లికార్జున్ ఖర్గే, జైరామ్ రమేశ్, ఇతర కాంగ్రెస్ సభ్యులపై ఆయన మండిపడ్డారు. గతంలోనే చరణ్సింగ్ సింగ్కు భారతరత్న ఇచ్చేందుకు మీకు టైమ్ దొరకలేదని విమర్శించారు. రైతుల కోసం పాటుపడిన చరణ్సింగ్ గురించి చర్చ జరుగుతుంటే అడ్డుకోవడం ద్వారా మీరు దేశ రైతాంగాన్నే అవమానించారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ నేతలు వాడుతున్న భాష సరిగ్గా లేదని ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. చరణ్సింగ్ను అవమానిస్తే తాను సహించనని అన్నారు. ఆయన దేశ సమగ్రత కోసం, ప్రజల క్షేమం కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. అనంతరం ఖర్గే మాట్లాడుతూ.. చరణ్సింగ్కు భారతరత్న ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ చర్చలో జయంత్కు ఏ రూల్ ప్రకారం అవకాశం ఇచ్చారని మరోసారి ప్రశ్నించారు.
#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar speaks to LoP Mallikarjun Kharge and other Congress leaders, says “You virtually insulted Chaudhary Charan Singh, you insulted his legacy. You had no time for Bharat Ratna Chaudhary Charan Singh. You are hurting every farmer in the… pic.twitter.com/jQpeEoUZ80
— ANI (@ANI) February 10, 2024
#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar speaks to LoP Mallikarjun Kharge and other Congress leaders, says “Don’t use this language. I will not tolerate insult to Chaudhary Charan Singh. He stands for impeccable public life, unimpeachable integrity, and commitment to… pic.twitter.com/U3CjESD25t
— ANI (@ANI) February 10, 2024