న్యూఢిల్లీ: పంజాబ్లో బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. పక్క పార్టీల నుంచే కాకుండా ప్రముఖులను కమల దళంలో చేర్చుకుంటున్నది. ఇందులో భాగంగా ప్రముఖ రెజ్లర్ గ్రేట్ ఖలి (Great Khali) నేడు కాషాయ కండువ కప్పుకోనున్నాడు. దీనికోసం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. కలీ అసలుపేరు దలీప్సింగ్ రానా.
పంజాబ్లో ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 117 సీట్లు ఉన్నాయి. సీఎం పీఠం కోసం అధికార కాంగ్రెస్ సహా బీజేపీ, ఆప్, అకాలీదళ్ పోరాడుతున్నాయి. అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పంజాబ్ రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నది.