మథుర: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ 50 ఏండ్ల మహిళకు కరోనా వైరస్ సోకింది. అయితే ఆమెలోపల సౌతాఫ్రికాలో విజృంభిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అమె మథుర జిల్లాలోని బర్సానా పట్టణానికి చెందిన హీరా దేవిగా గుర్తించారు. అమెకు సోకింది సౌతాఫ్రికా స్ట్రెయిన్ అని రుజువు కావడంతో ఆ పట్టణంలోని ప్రతి ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు.
హీరా దేవి ఈ నెల 3న కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దాంతో వైద్యులు ఆమె శాంపిల్లోని వైరస్ రకాన్ని గుర్తించడానికి మరిన్ని పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆమెకు సోకినది సౌతాఫ్రికా స్ట్రెయిన్గా బయటపడింది. కాగా, ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో 661 మందికి కరోనా సోకింది. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 5,049కి పెరిగింది. మృతుల సంఖ్య 8,773 చేరింది.