బిజ్నర్: వేరు కాపురం పెట్టలేదనే కోపంతో యూపీలోని ఒక మహిళ తన భర్త ప్రైవేట్ పార్ట్స్(లైంగిక అవయవాలు)ను సిగరెట్తో కాల్చి చిత్ర హింసకు గురి చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ నెల 5న బిజ్నర్ జిల్లా పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. తనకు డ్రగ్స్ ఇచ్చి తన భార్య మెహర్ జహన్ ఈ దాడికి పాల్పడిందని బాధితుడు మనన్ జైదీ వాపోయాడు. ఇందుకు సాక్ష్యంగా సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందించాడు.
నిందితురాలు భర్త ఛాతిపై కూర్చొని అతడి గొంతు నొక్కడం, లైంగిక అవయవాలను సిగరెట్తో కాల్చడం సీసీటీవీలో రికార్డయ్యాయి. గతంలోనూ తన భార్య తనపై ఈ విధంగా భౌతిక దాడి చేసిందని జైదీ తెలిపాడు. ఏడాది క్రితం తమకు పెండ్లయ్యిందని.. అప్పటి నుంచి వేరు కాపురం పెట్టాలని తన భార్య తనను వేధిస్తున్నదని బాధితుడు పోలీసులకు తెలిపాడు.