WhatsApp | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్.. ఇతర యాప్ యూజర్లకు సందేశాల్ని పంపేందుకు ‘థర్డ్ పార్టీ ఛాట్’ సెక్షన్.. తీసుకొస్తున్నామని వా ట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ తాజాగా వెల్లడించింది. వాట్సాప్ ఖాతాదారులు తమ సందేశాల్ని… ఇతర యాప్ల్లోని యూజర్లకు పంపేందుకు క్రాస్ ప్లాట్ఫామ్ మెసేజింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. తొలుత దీనిని ఈయూ నిబంధనల ప్రకారం యూరప్ దేశాల్లో తీసుకొస్తారని సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొత్త కాన్సెప్ట్పై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని వాట్సాప్ ఇంజినీర్ డిక్ బ్రౌజర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్, గూగుల్, ఐమెసేజ్ (యాపిల్).. మొదలైనవి వాట్సాప్తో చేతులు కలుపుతాయా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. యూజర్ల ప్రైవసీ, భద్రత నేపథ్యంలో కొత్త కాన్సెప్ట్పై కంపెనీల మధ్య పలు ఒప్పందాలు కుదరాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.