న్యూఢిల్లీ : వినియోగదారులకు మరింత గోప్యతనిచ్చే విధంగా మెటా సంస్థ వాట్సాప్ను తీర్చిదిద్దుతున్నది. తమ ఫోన్ నంబర్ను అవతలి వారికి తెలుపకుండానే వారితో చాటింగ్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ సదుపాయాన్ని మరో రెండు నెలల్లో అందుబాటులోకి తేనున్నట్టు ఓ ఆంగ్ల దినపత్రిక వెల్లడించింది.
ప్రస్తుతం ఫోన్ నంబర్తో వాట్సాప్నకు లాగిన్ అవుతున్న వినియోగదారులకు ప్రత్యేకమైన యూజర్నేమ్ ఇస్తారు. దానితో అవతలి వారికి సందేశాలు పంపడంతోపాటు చాటింగ్ చేయవచ్చు, వాయిస్, వీడియో కాల్స్ కూడా చేయవచ్చని ఆ వార్తా కథనం పేర్కొన్నది. దీంతో వినియోగదారులకు మరింత గోప్యత లభిస్తుందని తెలిపింది.