న్యూఢిల్లీ: దాదాపు రెండు గంటల అంతరాయం అనంతరం వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. సాంకేతిక సమస్య వల్ల సర్వర్ డౌన్ కావడంతో ఈ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. దాంతో వాట్సాప్ యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది యూజర్లు వాట్సాప్ డౌన్ కావడంతో వెంటనే టెలిగ్రామ్కు స్విచ్ అయ్యారు.
దాంతో మెటా సంస్థ వెంటనే వాట్సాప్ సేవలను పునరుద్ధరించేందుకు రంగంలోకి దిగింది. సాధ్యమైనంత త్వరలో సర్వీసులను పునరుద్ధరిస్తామని తెలిపింది. దాదాపు రెండు గంటలపాటు ప్రయత్నించి ఎట్టకేలకు వాట్సాప్ తిరిగి వచ్చేలా చేసింది.
కాగా, ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్కు 48 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 150 దేశాలు, 60 ప్రాంతీయ భాషల్లో వాట్సాప్ను వినియోగిస్తున్నారు. పైగా వాట్సాప్ ద్వారా ప్రతి రోజు 10 వేల కోట్ల మెసేజ్లు బదిలీ అవుతుంటాయి. రెండు గంటల అంతరాయం తర్వాతనైనా సేవలు పునఃప్రారంభం కావడంతో యూజర్లకు ఉపశమనం లభించింది.