హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కస్టమ్స్ సుంకం చెల్లింపు నిబంధనల్ని ఉల్లంఘించారని డెరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) చేసిన అభియోగాల కేసులో హైదరాబాద్ అబిడ్స్లోని పీహెచ్ జ్యువెల్స్కు హైకోర్టులో తాత్కాలిక వెసులుబాటు లభించింది. డీఆర్ఎఐ అదనపు డైరెక్టర్ జారీ చేసిన షోకాజ్ నోటీసులను పీహెచ్ జ్యువెల్స్ సవాల్ చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్ఎస్ రామచంద్రరావు, జస్టిస్ టీ వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. డీఆర్ఐ ఇచ్చిన నోటీసు అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలు జారీ చేసింది.
పీహెచ్ జ్యువెల్స్ సంస్థ ఎంఎంటీఎస్, ఎస్బీఐ వంటి సంస్థల నుంచి స్థానికంగా డ్యూటీ ఫ్రీ రూపంలో కొనుగోలు చేసిన బంగారాన్ని ఆభరణాలుగా చేయించి విదేశాలకు ఎగుమతి చేయడానికి కస్టమ్స్ శాఖ అనుమతి ఇచ్చింది. ఆ విధంగా కొనుగోలు చేసిన బంగారంతో చేసిన ఆభరణాలను విదేశాలకు ఎగుమతి చేయకుండా స్థానికంగా విక్రయించారని డీఆర్ఐ అభియోగం మోపింది. ఈ క్రమంలో ఇచ్చిన షోకాజ్ నోటీసును జ్యువెల్స్ ప్రతినిధి సంజయ్ అగర్వాల్ సహా ముగ్గురు హైకోర్టులో సవాల్ చేశారు. కస్టమ్స్ చట్టం–1962లోని 28 (4) నిబంధన ప్రకారం నోటీసు ఇచ్చే అధికారం డీఆర్ఐకి లేదని పిటిషనర్లు వాదించారు. కేనన్ ఇండియా–కస్టమ్స్ కమిషనర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. ఈ వాదనల తర్వాత హైకోర్టు.. డీఆర్ఐ షోకాజ్ నోటీసు అమలును నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
అది కాపీరైట్ ఉల్లంఘనే: ఢిల్లీ హైకోర్టు
రెజ్లర్ సాగర్ హత్య కేసులో ఒలింపియన్ సుశీల్ అరెస్ట్
ఆఫ్ఘాన్లో జిల్లాను ఆక్రమించిన తాలిబాన్లు.. దాడుల్లో 40 మంది తాలిబాన్లు హతం
మార్స్పై పని మొదలుపెట్టిన చైనా రోవర్
సూకీ ఆరోగ్యంగానే ఉన్నారు : జుంటా నేత హ్లింగ్
కరోనా వేళ మోదీ, సోనియా, ఇతర యూపీ ఎంపీలు ఎక్కడున్నారు.. ఏంచేస్తున్నారు..?
సువేందు అధికారి తండ్రి, సోదరుడికి వై ప్లస్ భద్రత
సంగీత దర్శకుడు రామ్లక్ష్మణ్ కన్నుమూత
వ్యాక్సిన్ల కొరత ప్రభుత్వ అలక్ష్యం వల్లే: ఎస్ఐఐ ఈడీ సురేశ్ జాదవ్
ఎగిరే యంత్రానికి రైట్ బ్రదర్స్కు పేటెంట్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..