ముంబై, ఆగస్టు 20: ముంబై నగరంలో 26/11 తరహాలో దాడులు చేయనున్నట్టు పాకిస్తాన్ కోడ్ నంబర్తో వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు వచ్చినట్టు సిటీ పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ చెప్పారు. శనివారం ఆయన మీడియాతో వర్లీలోని ట్రాఫిక్ విభాగం హెల్ప్లైన్ నంబర్కు శుక్రవారం ఈ మెసేజ్లు వచ్చినట్టు తెలిపారు. నగరాన్ని ధ్వంసం చేసేలా బాంబు దాడులు చేయనున్నట్టు సందేశాల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. మెసేజ్లను సీరియస్గా పరిగణించి, దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. కోస్ట్గార్డు సిబ్బంది సహకారంతో తీరప్రాంత భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని వెల్లడించారు. 2008 నవంబర్ 26న భారీ ఆయుధ సామగ్రితో ముంబైలో చొరబడి పాకిస్తాన్కు చెందిన పది మంది ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో 166 మంది చనిపోగా, 300 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే.