చెన్నై: సంక్రాంతి పండుగ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలో ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా జల్లికట్టు క్రీడలు జోరుగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. తాజాగా సోమవారం ఉదయం తిరుచిరాపల్లి జిల్లాలో జల్లికట్టు క్రీడ మొదలైంది. జిల్లాలోని సూరియూర్ గ్రామంలో జల్లికట్టు నిర్వహిస్తున్నారు.
ఇక్కడ జరిగే జల్లికట్టులో ఏకంగా 600 ఎద్దులు పాల్గొనబోతున్నాయని నిర్వాహకులు తెలిపారు. జల్లికట్టు సందర్భంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం 300 మంది పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఇక్కడ నిర్వహించే జల్లికట్టులో ఒక్కో ఆంబోతును క్రీడా మైదానంలోకి విడిచిపెడతారు.
కోపంతో రుసరుసలాడుతూ వచ్చే ఆ ఆంబోతును అప్పటికే మైదానంలో సిద్ధంగా ఉన్న పలువురు అణిచే ప్రయత్నం చేస్తారు. అలా ఆంబోతును ఎవరైతే అణిచి కింద పడేయగలుగుతారో వారిని విజేతలుగా ప్రకటిస్తారు. తిరుచిరాపల్లిలో మొదలైన జల్లికట్టు వీడియోను మీరు కూడా ఒకసారి వీక్షించండి.
#WATCH | Tamil Nadu: First #Jallikattu event of the year in Tiruchirappalli district began in Sooriyur village today. 600 bulls are expected to participate here. More than 300 police personnel are deployed for security. pic.twitter.com/9nfLlNybOg
— ANI (@ANI) January 16, 2023