Loksabha Elections : ఎన్నికల వేళ అభ్యర్థులుపడే పాట్లు అన్నీఇన్నీ కావు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం అభ్యర్థులు ఎన్నో జిమ్మిక్కులు చేస్తుంటారు. ప్రచారం వేళ బట్టలుతికే దగ్గరికి వెళ్తే బట్టలుతుకుతారు. అంట్లు తోమే దగ్గరికి వెళ్తే అంట్లు తోముతారు. ఇస్త్రీ షాప్ కాడికి పోతే ఇస్త్రీ చేస్తారు, కిరణా షాప్ దగ్గరికి పోతే కిరాణ సరుకులు అమ్ముతారు.
తమిళనాడులో అధికార డీఎంకే అభ్యర్థి మురసోలి కూడా లోక్సభ ఎన్నికల్లో తనను గెలుపించాలంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇవాళ తెల్లవారుజామునే తంజావూరు నియోజకవర్గం కేంద్రంలో మార్నింగ్ వాక్ చేస్తున్నవాళ్లతో మాట్లాడారు. తనకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన సైకిల్ తొక్కారు. పలువురికి హెర్బల్ జ్యూస్ సర్వ్ చేశారు.
#WATCH | Tamil Nadu: DMK candidate from Thanjavur parliamentary constituency S Murasoli sought votes by cycling in the Thanjavur city area. He also served ‘herbal soup’ to the people during the campaign.
All 39 seats in Tamil Nadu will vote in a single phase on April 19.… pic.twitter.com/02UNBfxe2H
— ANI (@ANI) April 15, 2024