బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశమైంది. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలి రోజు సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ వినూత్న రీతిలో హాజరయ్యారు. కారుకు బదులుగా ఎడ్ల బండిపై అసెంబ్లీకి హాజరై తన ప్రత్యేకతను చాటుకున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Bengaluru, Karnataka: Ravi Ganiga, Congress MLA of Mandya constituency arrives at Vidhana Soudha in a bullock cart pic.twitter.com/yv3xQqaEr3
— ANI (@ANI) May 22, 2023
తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు ఆర్వీ దేశ్పాండే ప్రొటెం స్పీకర్గా వ్యవహరించారు. అంతకుముందు కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్.. దేశ్పాండే చేత ప్రొటెం స్పీకర్గా ప్రమాణస్వీకారం చేయించారు. ఆ తర్వాత దేశ్పాండే కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయించారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా అందరూ ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు.