లక్నో: విద్యార్థులందరినీ సమానంగా చూడాల్సిన ఉపాధ్యాయురాలు, వారి మధ్య మత విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించింది. ముస్లిం పిల్లలను కొట్టాలంటూ హిందూ పిల్లలను ప్రోత్సహించింది. ఒక ముస్లిం విద్యార్థిని కొందరితో కొట్టించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఈ సంఘటన జరిగింది.
ఖుబ్బాపూర్ గ్రామంలోని నేహా పబ్లిక్ స్కూల్కు చెందిన ఒక టీచర్ వివాదస్పదంగా ప్రవర్తించింది. ఎంత మంది ముస్లిం విద్యార్థులు ఉంటే అంతమందిని కొట్టాలని హిందూ విద్యార్థులతో అన్నది. పైగా గట్టిగా ఎందుకు కొట్టడం లేదు అని ప్రశ్నించింది. అలాగే ఒక విద్యార్థి నడుంపైనా కొట్టమని చెప్పింది. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు ఒక ముస్లిం విద్యార్థి చెంప, నడుంపై కొట్టారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ముజఫర్నగర్ పోలీసుల దృష్టికి ఇది వెళ్లింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల మధ్య మతపరమైన విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయురాలు త్రిప్త త్యాగిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
A teacher is boasting how she beats up little muslim kids and asking other kids to slap him hard.
We cant imagine what this little kid has gone through💔
She can be heard jitne bhi Mohammedan bacche hai.pic.twitter.com/i1fDe0YoYg
— Sheldon Cooper (@Bazingaaaa_a) August 25, 2023
➡️थानाक्षेत्र मंसूरपुर के ग्राम खुब्बापुर के स्कूल में अध्यापिका द्वारा एक छात्र की कक्षा के अन्य छात्रों से पिटाई कराने तथा धार्मिक टिप्पणी करने के प्रकरण की जाँच थाना मंसूरपुर पुलिस द्वारा की जा रही है। प्रकरण के सम्बन्ध में क्षेत्राधिकारी खतौली डॉ0 रवि शंकर की बाईटः- pic.twitter.com/MrPuTBn07E
— MUZAFFARNAGAR POLICE (@muzafarnagarpol) August 25, 2023