లక్నో: ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 27,426 కరోనా కేసులు, 103 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,93,720కు, మరణాల సంఖ్య 9,583కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 6,426 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 6,33,461కు చేరిందని, ప్రస్తుతం 1,50,676 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.