న్యూఢిల్లీ: దేవీ నవరాత్రులను పురస్కరించుకొని ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించాలని యూనియన్ బ్యాంక్ ఈ నెల 1న ఆదేశించింది. 9 రోజులు ఏ రోజున ఏ రంగు దుస్తులు ధరించాలో సర్క్యులర్ జారీ చేసింది. ప్రతి బ్రాంచ్లో ఉద్యోగులు ప్రతీరోజు గ్రూప్ ఫొటో దిగాలని ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.200 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. దీనిపై బ్యాంకు ఉద్యోగ సంఘాల నుంచి విమర్శలు వచ్చాయి. ఇలా ఆదేశించడం తగదన్నాయి. దీంతో బ్యాంకు వెనక్కు తగ్గి సర్క్యులర్ను ఉపసంహరించుకొన్నది.