దేశంలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నా చాలాచోట్ల ఇంకా ఎండలు మండిపోతూనే ఉన్నాయి. భరించలేనంత వేడి ఉంటోంది. అందుకే చాలా మంది చల్లటి ప్రదేశాలకు టూర్ వెళ్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ యాత్రకు వెళ్లిన టీవీ నటి ఆంచల్ గోస్వామి చల్లటి మంచుపర్వతాలను చూసి పరవశించిపోయింది. ఆనందంలో అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను హిమాచల్ ప్రదేశ్లోని రోహ్తంగ్ పాస్ వద్ద చిత్రీకరించారు. అందమైన మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య ఆంచల్ గోస్వామి ‘జబ్ వి మెట్’ చిత్రంలోని ‘యే ఇష్క్ హే జన్నత్ దిఖాయే’ పాటపై డ్యాన్స్ చేసింది. ఆంచల్ ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి, ‘యే ఇష్క్ హాయే జన్నత్ దిఖాయే, ఔర్ హాన్ మేరే జైసే లాఖోన్ నహీ మేరే జైసీ మై ఏక్ హాయ్ హూన్, ఫీల్స్’ అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకూ 29,000 కంటే ఎక్కువ మంది లైక్ చేశారు.