తిరునల్వెల్లి: తమిళనాడులోని నలుగురు బాలికలను లైంగికంగా వేధించిన కేసులో ఓ నిందితుడికి తిరునల్వెల్లి పోక్సో కోర్టు(POCSO Court) మరణశిక్ష విధించింది. నిందితుడిని 47 ఏళ్ల అబ్రహంగా గుర్తించారు. జడ్జి సురేశ్ కుమార్ ఈ కేసులో తీర్పు ఇచ్చారు. నిందితుడికి నాలుగు మరణశిక్షలు వేశారు. 52వేల జరిమానా విధించారు. బాధిత అమ్మాయిలకు ఒక్కొక్కరికి 10 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2022 జూలై 5వ తేదీన తిరునల్వెల్లిలోని మహిళా పోలీసు స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఓ బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును రిజిస్టర్ చేశారు. అబ్రహంను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. ఛార్జీషీట్లో సాక్ష్యాలను నిరూపించినట్లు జడ్జీ సురేశ్ కుమార్ తేల్చారు.
తిరునల్వెల్లి జిల్లాలోని గంగైకొండ సమీపంలో ఉన్న మేలైలంతైకులం చర్చిలో అమ్మాయిలను బంధించి, వారిపై అత్యాచారానికి పాల్పడినట్ల పాస్టర్ అబ్రహంపై ఆరోపణలు ఉన్నాయి. చర్చికి వెళ్లిన అమ్మాయిలను అక్రమంగా ప్లాస్టర్ బంధించాడని, ఆ తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఒకవేళ విషయాన్ని బయట చెబితే చంపేస్తానని బెదిరించినట్లు ప్రాసిక్యూషన్ తన వాదనల్లో పేర్కొన్నది.