Neet Results | ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య విద్య కోర్సుల్లో అడ్మిషన్ల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)-2021లో ముగ్గురు విద్యార్థులు 720కి 720 మార్కులు సంపాదించారు. తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరి, ఢిల్లీ వాసి తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తిక నాయర్ పూర్తి మార్కులు సంపాదించారు.
నీట్-2021 పరీక్ష రాసిన విద్యార్థులు తమ స్కోర్ కార్డ్ కోసం neet.nta.nic.in, ntaresults.ac.in. వెబ్సైట్లను సందర్శించాలని ఎన్టీఏ తెలిపింది. ఈ ఏడాది 16,14, 777 మంది విద్యార్థులు నీట్కు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే 1.09 శాతం పెరిగింది. వారిలో 15,44,275 మంది పరీక్ష రాస్తే 8,70,074 మంది క్వాలిఫై అయ్యారు. కనీస క్వాలిఫైంగ్ మార్కులు, నీట్ కటాఫ్ మార్క్లు తగ్గాయి.