చాలా బాలీవుడ్ సినిమాలు నిజ జీవితంలో నేరాలు చేసేందుకు ప్రజలను ప్రేరేపించాయి. ఇటీవల ఒడిశాలోని ఓ పాఠశాలలో ధూమ్ సినిమా సిరీస్ స్ఫూర్తితో చోరీ జరిగింది. ఒడిశాలోని నబరంగ్పూర్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ పాఠశాల బ్లాక్ బోర్డుపై ‘ఇట్స్ మీ ధూమ్ 4’ అని రాశారు.
పాఠశాల ప్రధాన గేటు పగులగొట్టి ఉండడాన్ని ఆ స్కూల్ ప్యూన్ గుర్తించాడు. వెంటనే ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందించాడు. హెచ్ఎంతోపాటు సిబ్బంది వచ్చిచూడగా పాఠశాలలోని కంప్యూటర్లు, ప్రింటర్, ఫొటోకాపియర్, బరువు యంత్రం, సౌండ్ బాక్స్ కనిపించలేదు. బ్లాక్బోర్డ్పై రాసి ఉన్న సాహసోపేతమైన హెచ్చరిక చూసి అంతా షాక్ అయ్యారు.. ‘ధూమ్ 4’, ‘మేము తిరిగి వస్తాం’, ‘త్వరలో వస్తుంది’ అని దొంగలు ఒరియాలో రాశారు. “మీకు వీలైతే మమ్మల్ని పట్టుకోండి” అని కూడా రాశారు. అంతే కాకుండా పోలీసులను తప్పుదారి పట్టించేందుకు బ్లాక్బోర్డ్పై పలు ఫోన్ నంబర్లు కూడా రాసి ఉంచినట్లు తెలుస్తోంది.
ఆ ఫోన్ నంబర్లలో ఒకటి ఉపాధ్యాయుడిది అని పోలీసులు గుర్తించారు. అయితే, దొంగలు తన నంబర్ను బ్లాక్బోర్డ్పై ఎందుకు రాశారో తనకు తెలియదని సదరు ఉపాధ్యాయుడు తెలిపాడు. దీంతో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సర్బేశ్వర్ బెహెరా.. ఖాతిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసు బృందం సైంటిఫిక్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్తో కలిసి పాఠశాలను సందర్శించి ముఠా గురించి ఆధారాలు సేకరించింది.