న్యూఢిల్లీ, జూలై 13: గతవారం అమర్నాథ్లో చోటుచేసుకున్న వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక ప్రాంతంలో గంట వ్యవధిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే క్లౌడ్ బరస్ట్గా పిలుస్తామని, అయితే ఘటన జరిగిన రోజున ఎగువ ప్రాంతాల్లో రెండు గంటల్లో 28 మిల్లీమీటర్ల వర్షపాతమే రికార్డయినట్టు చెప్పారు. సాధారణంగా ఇలాంటి విపత్తులను ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ రికార్డ్ చేస్తాయని, అయితే, హిమాలయాల్లో ఉన్న దుర్బేద్యమైన పరిస్థితుల కారణంగా వెదర్ స్టేషన్లు, రాడార్లు కూడా వరదలను పసిగట్టలేకపోయాయని వెల్లడించారు. వాతావరణ మార్పులు కూడా ప్రస్తుత ఘటనకు కారణంగా వివరించారు.