న్యూఢిల్లీ, జూలై 2: ఉత్తరాది జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్లను అండమాన్, నికోబార్లోని జైళ్లకు తరలించాలని ఎన్ఐఏ సూచించింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఇటీవల ఢిల్లీ తీహార్ జైలులో గ్యాంగ్స్టర్ టిల్లు తాజ్పురియాను ప్రత్యర్థి గ్యాంగ్ దారుణంగా హత్య చేయడాన్ని ఎన్ఐఏ ప్రస్తావించింది.
నిత్యం అశాంతిని సృష్టిస్తున్న 10-12 మంది గ్యాంగ్స్టర్లను వెంటనే అండమాన్ జైళ్లకు పంపాలని కోరింది. గ్యాంగ్స్టర్ టిల్లు దారుణ హత్య తర్వాత ఢిల్లీ తీహార్ జైలు అధికారులు సైతం ప్రమాదకరమైన గ్యాంగ్స్టర్లను ఇతర రాష్ర్టాల లోని జైళ్లకు పంపాలని హోంశాఖకు విజ్ఞప్తి చేశారు.