ముంబై, ఆగస్టు 5: ఏదైనా సంస్థ యజమాని తన ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై జోక్యం చేసుకునే హక్కు జాతీయ ఎస్సీ కమిషన్కు లేదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్రలో ఓ స్టాఫ్ నర్సుపై తీసుకున్న చర్యల విషయంలో మరోసారి విచారణ జరుపాలంటూ ఈ ఏడాది మార్చిలో ఎస్సీ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే వీటిని సవాల్ చేస్తూ రక్షణ శాఖ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ ఆర్డీ ధనుక, జస్టిస్ కమల్ ఖాటాతో కూడిన ధర్మాసనం విచారించింది. మహారాష్ట్ర నాసిక్లోని దేవలాలిలో ఉన్న కంటోన్మెంట్లో చంద్రప్రభ కేరా నర్సు 1973లో చేరారు. అయితే 2013లో నర్సుపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలంటూ తనపై ఒత్తడి తీసుకొచ్చారని పేర్కొంటూ చంద్రప్రభ హైకోర్టును ఆశ్రయించారు.