Doli utsav : బైసాఖీ పండుగను పురస్కరించుకుని ఉత్తరాఖండ్లోని పలు ఆలయాల్లో వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా రుద్రప్రయాగలోని ఓంకారేశ్వర ఆలయంలో కూడా ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీమద్మహశ్వరుడి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు.
ఈ పల్లకీ సేవలో భాగంగా ఉత్సవ విగ్రహాన్ని పూలతో అందంగా అలంకరించిన డోలీలో ఆలయ వీధుల్లో ఊరేగించి తిరిగి గుడిలోకి చేర్చారు. దేశంలోని ఐదు కేదార్లలో రెండో కేదార్గా ఈ ఓంకారేశ్వర ఆలయానికి గుర్తింపు ఉంది. కేదార్నాథ్ ఆలయాన్ని మొదటి కేదార్గా పరిగణిస్తారు. కాగా, పరమ శివుడిని డోలీలో ఊరేగిస్తున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Rudraprayag, Uttarakhand: The idol doli of Lord Shri Madmaheshwar, the second Kedar among the Panch Kedars, was carried out in Shri Omkareshwar temple premises on the occasion of Baisakhi. pic.twitter.com/bthiddpR01
— ANI (@ANI) April 13, 2024