చెన్నై: దక్షిణాదిలో కనిపించిన ఈ సూర్యోదయ వెలుగు దేశమంతా విస్తరించాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆకాంక్షించారు. కర్ణాటలో బీజేపీ ఓటమితో దక్షిణాది నుంచి ఆ పార్టీ కనుమరుగు కావడంపై ఈ మేరకు వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్తోపాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు హాజరయ్యారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు విపక్షాల ఐక్యతను ఈ మేరకు చాటారు.
ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఒక ట్వీట్ చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సెక్యులర్ సిద్ధాంతాలున్న వారిద్దరూ తమ సమర్థ పాలనతో కర్ణాటకను కొత్త శిఖరాలకు చేర్చుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే దక్షిణాదిలో కనిపించిన ఈ సుర్యోదయపు వెలుగు (బీజేపీ కనుమరుగు) భారత దేశ వ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు. ‘ఇవాళ బెంగళూరులో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ కొత్త వాతావరణ మార్పునకు శుభ గడియలు’ అని పేర్కొన్నారు.
Hearty congratulations to Hon'ble @siddaramaiah avaru and Hon'ble @DKShivakumar avaru on taking oath as the Chief Minister and Deputy Chief Minister of Karnataka respectively.
I sincerely believe that the secular duo will take the state of #Karnataka to newer heights with their… pic.twitter.com/VxV6lRsskW
— M.K.Stalin (@mkstalin) May 20, 2023