న్యూఢిల్లీ: ఈ నెల 18న దేశ రాజధాని ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని తెలిపింది. కాగా, ఈ సమావేశంలో పాన్ మసాలా, గుట్కా కంపెనీలపై విధించాల్సిన పన్నులపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
అదేవిధంగా అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు, ఆన్లైన్ గేమింగ్, క్యాసినో, హార్స్ రేసింగ్పై జీఎస్టీ లెవీ గురించి కూడా ఈ కౌన్సిల్ మీట్ చర్చించే ఛాన్స్ ఉంది. కాగా, 2022 డిసెంబర్ 17న జీఎస్టీ కౌన్సిల్ 48వ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఆ సమావేశానికి కూడా నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు.