సర్కోలీ: సోలాపూర్ జిల్లాలోని సర్కోలీ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహరింగసభను నిర్వహించింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బహిరంగసభకు హాజరయ్యారు. ఈ సభకు మహారాష్ట్ర ప్రజలు భారీగా తరలివచ్చారు. జై బీఆర్ఎస్, జై కేసీఆర్ అనే నినాదాలతో సర్కోలీ బహిరంగ సభా ప్రాంగణం మార్మోగుతున్నది.
ఈ సందర్భంగా సోలాపూర్ జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. భగీరథ్ బాల్కేతోపాటు పెద్ద సంఖ్యలో చిన్న, పెద్ద నాయకులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరికాసేపట్లో సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడనున్నారు.