చెన్నై: అభ్యర్థి గెలుపుపై చిలుక జోస్యం చెప్పినందుకు ఇద్దరు జ్యోతిష్కులకు అటవీ శాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. పక్షులను పంజరంలో బంధించినందుకు వారిని అరెస్ట్ చేశారు. గట్టిగా హెచ్చరించిన తర్వాత వారిని విడిచిపెట్టారు. (parrot fortune teller arrest) తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెల్వరాజ్ అనే వ్యక్తి చిలుక ద్వారా జాతకాలు చెబుతాడు. పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) కడలూరు నియోజకవర్గ అభ్యర్థి తంగర్ బచ్చన్ ప్రచారంలో భాగంగా ఎన్నికల్లో తన గెలుపు గురించి చిలుక జాతకం చెప్పించుకున్నాడు. ఆయన ఇష్ట దైవం ఉన్న కార్డును చిలుక తీసింది. దీంతో తంగర్ బచ్చన్ గెలుస్తారని చిలుక జ్యోతిష్కుడు సెల్వరాజ్ చెప్పాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో చిలుక జ్యోతిష్కులైన సెల్వరాజ్, అతడి సోదరుడ్ని అటవీశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్షులను పంజరంలో బంధించడంపై వారిని ప్రశ్నించారు. అయితే వార్నింగ్ ఇచ్చిన తర్వాత వారిద్దరిని విడిచిపెట్టారు.
தங்கர் பச்சான் பார்த்த ஜோசியம்.. ஜோசியரை கைது செய்த வனத்துறை! | Election 2024#cuddalore #pmk #thangarbachan #ramadoss #anbumaniramadoss #elections2024 #electioncampaign2024 #loksabhaelection2024 #kumudamreporter pic.twitter.com/ZHClVeYaLH
— Kumudam Reporter (@ReporterKumudam) April 9, 2024