న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన ప్రకటనపై ఎన్నికల సంఘానికి ఓ కేంద్ర మాజీ అధికారి, మరో హక్కుల కార్యకర్త ఫిర్యాదు చేశారు. 2002లో దొమ్మీకారులకు గుణపాఠం నేర్పామని ఆయన అనడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై విచారణ జరిపి తగిన శిక్ష విధించాలని కోరారు. ప్రజల మధ్య చీలికలు తెచ్చే ఇలాంటి ప్రకటనలను అనుమతించరాదని కోరారు. గుణపాఠం నేర్పామని అనడంలో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొన్నారనే అర్థం వస్తున్నదని తెలిపారు. కేంద్ర మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ, సామాజిక కార్యకర్త జగదీప్ చోకర్ ఈసీకి లేఖలు రాశారు.