న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి భద్రతను కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) డైరెక్టర్ అరుణ్కుమార్ సిన్హా (61) బుధవారం గురుగ్రామ్లోని ఓ దవాఖానాలో కన్నుమూశారు. 1987 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన సిన్హా, గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం పరిస్థితి విషమించటంతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సిన్హా 2016 మార్చిలో ఎస్పీజీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం మే 31తో ముగియగా.. ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది.