Viral Video: పిల్లల బాగు కోసం తల్లిదండ్రులు వాళ్లను తిట్టడం, అప్పుడప్పుడు కొట్టడం లాంటివి చేస్తుంటారు. అయితే చాలా సందర్భాల్లో పిల్లలు కన్నవాళ్ల అజమాయిషీని తప్పుగా అర్థం చేసుకుని తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. చివరికి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని హుమాయూన్పూర్ గ్రామానికి చెందిన ఐఐటీ విద్యార్థి అనూజ్ను తండ్రి మందలించాడు. అనూజ్ ఎదురు సమాధానం చెప్పడంతో తండ్రి మరింత ఆగ్రహించి ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు అన్నాడు. దాంతో మనస్తాపానికి గురైన అనూజ్ ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లాడు.
ఓ ట్రాక్పై రైలు రావడాన్ని గమనించి పరుగున వెళ్లి అడ్డంగా పడుకున్నాడు. స్టేషన్లోని ప్రయాణికులు అది గమనించి గట్టిగా అరవడంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. అతడిని పక్కకు ఈడ్చుకెళ్లారు. అనంతరం అతని పేరెంట్స్ను పిలిపించి మాట్లాడారు. విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అనూజ్ ఆత్మహత్యాయత్నం దృశ్యాలు స్టేషన్లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
Watch this
Earlier in the afternoon, alert men of #Firozabad GRP rescued a 20-year-old ITI student as he laid down on railway track after been reprimanded by parents.#UttarPradesh #Railways@spgrpagra pic.twitter.com/SvmOMkTl83
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) October 6, 2022