టికాంగఢ్ (మధ్యప్రదేశ్), జనవరి 23: దేశంలో ఇటీవల చిన్నారులు, యువత గుండెపోటుతో మరణిస్తున్నట్టు ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. సోమవారం ఉత్తరప్రదేశ్లో ఐదేండ్ల బాలిక గుండెపోటుతో మరణించగా, తాజాగా మధ్యప్రదేశ్లోని టికాంగఢ్ జిల్లాలో 35 ఏండ్ల ఆర్మీ జవాన్ క్రికెట్ ఆడు తూ గుండెపోటుతో మరణించాడు. సెలవుపై ఇంటికి వచ్చిన లాన్స్ నా యక్ వినోద్ భాస్కర్ తోటి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారి ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే అతడిని దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు.