చండీఘఢ్ : పంజాబ్ కాంగ్రెస్లో అంతర్గత పోరుకు తెరపడటం లేదు. సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీపై పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోమవారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కొత్త పధకాల ప్రకటనను సిద్ధూ తప్పుపట్టారు. సీఎం ప్రకటిస్తున్న పధకాలకు బడ్జెట్ కేటాయింపులు లేవని దుయ్యబట్టారు. కాగా రాష్ట్రంలో యూనిట్కు రూ 3 చొప్పున విద్యుత్ రేట్లను తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని సీఎం చరణ్జిత్ సింగ్ చన్ని ప్రకటించారు.
మరోవైపు కెప్టెన్ అమరీందర్ సింగ్ను తప్పించి కొత్త సీఎంను తెరపైకి తెచ్చినా ఆయనతోనూ సిద్ధూకు పొసగకపోవడంతో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం తలపట్టుకుంటోంది. ఇక కాంగ్రెస్ను వీడిన కెప్టెన్ సింగ్ కొత్త పార్టీతో ప్రజల ముందుకు వస్తానని, అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో సీట్ల సర్ధుబాటు చేసుకుంటామని ప్రకటించారు.