న్యూఢిల్లీ, జనవరి 2: మానవ వ్యర్థాలను విమాన ఇంధనంగా మార్చే పద్ధతిని పరిశోధకులు కనుగొన్నారు. గ్లౌసెస్టర్షైర్లోని ఫియర్ఫ్లై గ్రీన్ ప్యూయెల్స్ సంస్థ సీఈవో జేమ్స్ హైగేట్ దీనిపై స్పందిస్తూ.. ఈ ఇంధనం 92 శాతం తక్కువగా కార్బన్ డై ఆక్సైడ్ను విడుదల చేస్తుందని తెలిపారు.
హైడ్రోథర్మల్ ద్రవీకరణ పద్ధతి ద్వారా ఈ ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చని చెప్పారు. అధిక ఒత్తిడి, వేడిని ఉపయోగించి ‘బయో సాలిడ్స్’ పద్ధతి ద్వారా మానవ వ్యర్థాలను కార్బన్ అధికంగా కలిగిన బయోచార్(ఒక రకమైన బొగ్గు), ముడి చమురుగా మారుస్తారు. ప్రాథమిక ప్రయోగాల్లో మానవ వ్యర్థాల నుంచి కిరోసిన్ ఉత్పత్తి చేశారు. దీనిపై మరింత పరిశోధనలు చేస్తున్నారు.