న్యూఢిల్లీ : కరోనా బారినపడి చికిత్స పొందుతున్న సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఆజం ఖాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మే 9న కొవిడ్-19 పాజిటివ్ గా నిర్థారణ కావడంతో లక్నోలోని మెదాంత దవాఖానలో ఆయన ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందుతున్నారు. ఆయన కుమారుడు అబ్ధుల్లా ఆజంకు కూడా మహమ్మారి సోకగా అనంతరం ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో నెగెటివ్ రిపోర్టు వచ్చింది. దాదాపు 100కు పైగా కేసులను ఎదుర్కొంటున్న ఆజం ఖాన్ కుమారుడితో కలిసి సీతాపూర్ జైలులో ఉంటున్నారు.
అదే జైలులో ఉన్న ఆజం ఖాన్ భార్య ఎస్పీ ఎమ్మెల్యే తాంజీన్ ఫాతిమా ఫోర్జరీ కేసులో గత ఏడాది డిసెంబర్ లో బెయిల్ పై విడుదలయ్యారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి సీతాపూర్ జైలులో ఉన్న ఆజం ఖాన్ పై భూ ఆక్రమణలు, కబ్జాలు, విద్యుత్ చౌర్యం, అణిచివేత వంటి పలు అభియోగాలున్నాయి.