పట్నా: బీహార్ రాష్ట్రంలోని మొకామా అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం కనబర్చిన ఆర్జేడీ అభ్యర్థి నీలమ్ దేవి చివరి వరకు తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. ఆఖరికి 16,741 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవిపై ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా నీలమ్ దేవి మీడియాతో మాట్లాడుతూ.. తన గెలుపు ముందు ఊహించిందేనని చెప్పారు.
మొకామా పరుషురాముడి జన్మస్థానమని, ఇక్కడి ప్రజలు ప్రలోభాలకు లొంగరని నీలమ్ దేవి వ్యాఖ్యానించారు. మొకామా సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ అక్రమ ఆయుధాలు కేసులో అరెస్ట్ కావడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దాంతో ఉపఎన్నికల్లో ఆయన సతీమణి నీలమ్ పోటీచేసి విజయం సాధించారు. కాగా, నీలమ్ దేవి గెలుపుతో మొకామాలో ఆర్జేడీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మిఠాయిలు పంచుకుంటూ, పటాకులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
#MokamaBypoll : #RJD candidate #NeelamDevi’s supporters celebrate her victory#Bihar pic.twitter.com/1jmUGgA31u
— TOI Patna (@TOIPatna) November 6, 2022