న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ముండ్కా మెట్రోస్టేషన్ సమీపంలోని నాలుగంతస్తుల భవనంలో ఘోర
అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 30కి పెరిగిందని అధికారులు
తెలిపారు. ఇప్పటి వరకు 24 మంది మహిళలు, ఐదుగురు వ్యక్తులు మృతి చెందారని, సెర్చ్ ఆపరేషన్లో
మరొకరి అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. భవనంలో ఉంచి ప్లాస్టిక్ మెటీరియల్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు పేర్కొన్నారు.
ముండ్కా స్టేషన్కు దగ్గరలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరగ్గా.. శనివారం వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగగా.. రెండో అంతస్తులో మానవ అవశేషాలు కనిపించాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఏసీలో జరిగిన బ్లాస్ట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నట్లు డీఎఫ్ఎస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. నాలుగు అంతస్తుల భవనంలో మొదటి అంతస్తు నుంచి మంటలు చెలరేగాయని పోలీసులు పేర్కొన్నారు. భవనంలో సీసీటీవీ కెమెరా, రూటర్ తయారీ, అసెంబ్లీంగ్ కంపెనీ కార్యాలయాలున్నాయి.
కంపెనీ కంపెనీ యజమాని హరీశ్ గోయల్, అతని సోదరుడు వరుణ్ గోయల్ను అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ సమీర్ శర్మ తెలిపారు. మరో వైపు భవనం యజమాని మనిష్ లక్రాపై సైతం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో 12 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకొని చనిపోయిన వారిలో 25 మంది మృతదేహాలను గుర్తించాలని ఉందని, డీఎన్ఏ నమూనాలను తీసుకుంటామన్నారు. మరో వైపు 29 మంది ఆచూకీ లేదని ఫిర్యాదులు అందాయని డీసీపీ తెలిపారు.