లక్నో: సనాతన ధర్మం(Sanatan Dharma)పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. గతంలోనూ సనాతన ధర్మంపై దాడులు జరిగాయని, ఇప్పుడు కూడా ఆ ధర్మానికి ఎటువంటి హాని జరగదని, అధికారం దాహంతో ఉన్న పరాన్నజీవులు చేసే దాడులు ఏమీ చేయలేవని సీఎం యోగి అన్నారు. శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా పోలీస్ లైన్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ యూపీ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రావణాసురుడి సనాతనం, కంసుడి సనాతనం, బాబర్.. ఔరంగజేబు అకృత్యాలు ఆ ధర్మాన్ని ఏమీ చేయలేకపోయాయని, అంత గొప్ప ధర్మాన్ని ఈ అధికార పరాన్నజీవులు రూపుమాపడం సాధ్యమవుతుందా అని సీఎం యోగి అన్నారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.