లక్నో: ప్లాట్ఫారమ్ నుంచి రైలు (Train) కదులుతున్నది. క్రమంగా స్పీడ్ అందుకుంటున్నది. ఇంతలో ఓ మహిళ పరుగున వచ్చి రైల్లోకి ఎక్కడానికి ప్రయత్నించింది. అయితే పట్టు కోల్పోవడంతో కింద పడిపోయింది. రైలుకు.. ప్లాట్ఫారమ్కు మధ్య ఉండే గ్యాప్లో ఇరుక్కుపోయింది. గమనించిన రైల్వే కానిస్టేబుల్ (Railway Constable) ఆమెను పైకిలాగిన ఘటన ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్నది.
గోరఖ్దామ్ ఎక్స్ప్రెస్ (Gorakhdam Express) గోండా రైల్వే స్టేషన్కు వచ్చి ఆగింది. కొద్దిసేపటి తర్వాత తిరిగి తన ప్రయాణం ప్రారంభించింది. క్రమంగా రైలు స్పీడ్ అందుకుంటుంగా ఓ మహిళ బోగీలోకి ఎక్కడానికి యత్నించింది. పట్టుసడలడంతో రైలు, ప్లాట్ఫామ్ మధ్య ఉండే సందులో పడిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న రామ్సుందర్ జైస్వార్ (Ramsundar Jaiswar) అనే రైల్వే హెడ్కానిస్టేబుల్ చాకచక్యంగా ఆమెను పట్టుకున్నాడు. రైలు కింద పడిపోతున్న ఆమెను మరో వ్యక్తితో కలిసి పైకి లాగాడు. దీంతో స్వల్ప గాయాలతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్ను రైల్వే అధికారులతోపాటు స్థానిక ప్రజలకు ప్రశంసించారు.