Rahul Gandhi : డిమాండ్ల సాధనకు రైతులు ఛలో ఢిల్లీ పిలుపు ఇచ్చిన నేపధ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపొంది పాలనా పగ్గాలు చేపడితే రైతులందరికీ తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పిస్తూ చట్టపరమైన భద్రత కల్పిస్తామని రాహుల్ భరోసా ఇచ్చారు. స్వామినాథన్ కమిషన్ సూచనల ప్రకారం ఎంఎస్పీకి చట్టబద్దత కల్పిస్తామని ప్రకటించారు.
ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించడం చారిత్రక నిర్ణయమని 15 కోట్ల మంది రైతుల జీవితాలను ఇది మార్చేస్తుందని, వారి సౌభాగ్యానికి దారితీస్తుందని రాహుల్ పేర్కొన్నారు. న్యాయం చేసే దిశగా ఇది కాంగ్రెస్ తొలి గ్యారంటీ అని ఆయన వివరించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ ఈ హామీ ఇచ్చారు.
కాగా, పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమంలో భాగంగా పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని శంభు బార్డర్కు రైతులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ముందుగా పోలీసులు వచ్చినవాళ్లను వచ్చినట్టే అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు.కానీ, కాసేపటికే రైతుల సంఖ్య పెద్ద ఎత్తున పెరగడంతో అరెస్టులు సాధ్యం కాలేదు. వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో ఆందోళనకారులు తలోదిక్కు పరుగులు తీశారు. అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
Read More :
Arvind Kejriwal | అన్నదాతను నిర్బంధించడం తప్పు : మోదీ సర్కార్పై ఆప్ ఫైర్