ముంబై: రిపబ్లిక్ డే చాలా దూరంలో లేదని, నాలుగు లక్షల ట్రాక్టర్లతో రైతులు ఇక్కడే ఉన్నారని భారత్ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయిత్ అన్నారు. ప్రభుత్వం తన మార్గాన్ని సరిదిద్దుకోవాలని, పంటలకు కనీస మద్దతు ధర (MSP) హామీ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే గణతంత్ర దినోత్సవం రోజున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆదివారం కిసాన్ మహాపంచాయత్ నిర్వహించారు. పంటలకు కనీక మద్దతు ధర చట్టం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా రాకేష్ టికాయిత్ తెలిపారు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు MSPకి మద్దతుదారుగా ఉన్నారన్నారు. రైతుల ప్రయోజనాలకు హామీ ఇచ్చేలా దేశవ్యాప్త చట్టం చేయాలని నాడు ఆయన అన్నట్లు గుర్తు చేశారు.
పంటలకు కనీస మద్దతు ధర చట్టంతోపాటు విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, లఖింపూర్ ఖేరీ హింసాకాండపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా అరెస్టు వంటి ఇతర డిమాండ్లను రైతు నేతలు పునరుద్ఘాటించారు.
#WATCH | In Mumbai, BKU leader Rakesh Tikait says, "Govt of India should mend its ways and bring a law on MSP. Otherwise, January 26 (Republic Day) is not far, and 4 lakh tractors & farmers all are there." pic.twitter.com/sBMoJ9N1rI
— ANI (@ANI) November 28, 2021