కాన్పూర్: యూపీలోని కాన్పూర్కు చెందిన ఓ పూజారి మాంసాన్ని సేవించినట్లు ఫోటో వైరల్ కావడంతో అతన్ని గుడి విధుల నుంచి తొలగించారు. కేశవపురంలోని శ్రీ భూతేశ్వర్ ధామ్ ఆలయం(Bhuteshwar Dham Temple)లో ఈ ఘటన జరిగింది. ఆ గుడిలోనే ప్రధాన పూజారిగా ఉన్న అతని తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫోటోలో ఉన్న వ్యక్తి తన కుమారుడు ప్రశాంత్ గిరి అని తండ్రి సంతోష్ గిరి గుర్తించాడు. పూజారిగా ఉంటూ మాంసం తిన్న ప్రశాంత్ గిరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఊరేగింపు సమయంలో గుడి వద్ద ఆ వ్యక్తిని బయటకు లాగి చితకబాదారు. ఆ తర్వాత ఆ పూజారీ ఆచూకీ లేడు. నా భార్య, కోడలు ఆపే ప్రయత్నం చేసినా.. స్థానికులు వారిపై కూడా దాడి చేసినట్లు సంతోష్ గిరి తెలిపాడు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే గుడి ప్రాంగణంలో ఉన్న ఓ రూమ్లో ప్రశాంత్ గిరి నివసిస్తున్నట్లు తెలిసింది. గుడిలో ఉంటూనే పూజలు చేస్తూ మంసాహారాన్ని సేవించడం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.