Apps:
Follow us on:

Ram Temple’s | దేశవ్యాప్తంగా ఈ రామాలయాలు ఎంతో ఫేమస్‌.. వీటి ప్రత్యేకతలివే!

1/10మహా విష్ణువును శ్రీరాముడిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. మర్యాద పురుషోత్తముడు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పుట్టాడని స్థలపురాణం చెబుతున్నది. అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం రామ మందిరం రూపుదిద్దుకున్నది. 500 ఏళ్ల నాటి కల సాకారమైంది. ప్రధాని నరేంద్ర మోదీ బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. రేపటి నుంచి సామాన్య ప్రజలకు దర్శన భాగ్యం కలుగనున్నది. ఈ క్రమంలో భారీగా తరలిరానున్నారు. అయోధ్య చరిత్ర చాలా మందికి తెలిసిందే. అయోధ్యతో పాటు భారత్లో చాలా ప్రముఖ రామాలయాలు సైతం ఉన్నాయి. ఇక్కడ శ్రీరాముడిని దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.. మరి ఆ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసొద్దాం రండి..!
2/10కేరళ రామస్వామి ఆలయం ఉన్నది. త్రిసూర్ జిల్లా త్రిప్రయార్లో ఈ ఆలయం ఉన్నది. ఇక్కడ స్వామి శంఖం, సుదర్శన చక్రం, విల్లు, దండంతో దర్శనమిస్తారు. ఈ ఆలయం కరువన్నూర్ నది ఒడ్డున ఉంది. త్రిప్రయార్ గుండా ప్రవహిస్తుండగా తీవ్రా నదిగా పిలుస్తుంటారు. ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని స్వయంగా కృష్ణుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఆలయాన్ని దర్శించే భక్తులకు దుష్టశక్తుల నుంచి విముక్తి లభిస్తుందని భావిస్తుంటారు.
3/10కాలారామ్ మందిర్ మహారాష్ట్రలోని నాసిక్లోని పంచవటిలో ఉంది. ఇక్కడ రెండు అడుగుల ఎత్తులో శ్రీరాముడు కొలువై ఉన్నాడు. వనవాస సమయంలో సీతామా, లక్ష్మణుడితో కలిసి రాముడు పంచవటిలోనే ఉన్నట్లు స్థలపురాణం చెబుతున్నది. ఆలయాన్ని సర్దార్ రంగారు ఒదేకర్ నిర్మించారు. ఒదేకర్కు ఒక రోజు కలలో గోదావరి నదిలో శ్రీరాముడి నల్లని విగ్రహం ఉన్నట్లుగా కనిపించింది. మరుసటి రోజు అక్కడికి వెళ్లి చూడగా విగ్రహం కనిపించింది. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి.. ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం చూసున్నది అదే ఆలయం.
4/10సీతారామచంద్రస్వామి ఆలయం, భద్రాచలం  తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలోని భద్రాచలంలో సీతారామస్వామి ఆలయం ఉన్నది. కుడి చేతిలో బాణాన్ని, ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంఖును ఎడమచేతిలో చక్రాన్ని ధరించి ఉంటుంది. గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్నకొండ వద్ద శ్రీరాముడు కొలువై ఉన్నాడు. భక్తుడైన భద్రుడి కోరిక మేరకు.. భద్రగిరిపై వెలసి భద్రాద్రి రాముడిగా పూజలందుకుంటున్నాడు. కంచర్ల గోపన్న (భక్త రామదాసు) భద్రాచలం తహసీల్దార్గా ఉన్న సమయంలో సమయంలో విరాళాలు సేకరించి నిర్మించాడు. గోల్కొండలోని చెరసాలలో రామదాసును బంధించగా.. ఆయనను విడిపించేందుకు స్వయంగా రాముడే వచ్చి నిజాం నవాబుకు సొమ్ము చెల్లించాడని ఆలయ చరిత్ర చెబుతున్నది.
5/10రామరాజ ఆలయం, మధ్యప్రదేశ్  రామరాజ ఆలయంలో మధ్యప్రదేశ్ ఓర్చాలో ఉన్నది. ఇక్కడ రాముడు రాజుగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం ఓ రాజభవనంలా ఉంటుంది. ప్రతి రోజు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహిస్తుంటారు. ఆలయంలో పోలీసు సిబ్బందిని గార్డ్లుగా నియమించారు. ఆలయంలో రాముడికి ప్రతిరోజు సాయుధులు నమస్కరిస్తుంటారు. ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే రాముడి కుడిచేతిలో కత్తి, మరో చేతిలో కవచం ఉంటుంది. శ్రీరాముడు పద్మాసనంలో కూర్చొని, ఎడమ కాలును కుడి తొడ మీదుగా ఉంచి కూర్చొని కనిపిస్తాడు.
6/10కనక్ భవన్ ఆలయం అయోధ్య రామాలయానికి సమీపంలోనే ఉంటుంది. సీతాదేవికి శ్రీరాముడితో వివాహం అయిన తర్వాత కైకేయి సీతామాతకు బహుమతిగా ఇచ్చిందని ఇక్కడి భక్తుల విశ్వాసం. కనక్ భవనాన్ని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు స్వయంగా పునర్నిర్మించాడని చరిత్ర చెబుతున్నది. మధ్యయుగ కాలంలో చక్రవర్తి విక్రమాదిత్యుడు, ఆ తర్వాత ఓర్చా రాణి వృషభాను కున్వారి పునరుద్ధరించినట్లు స్థల పురాణం చెబుతున్నది. గర్భాలయంలో సీతాదేవితో కలిసి శ్రీరాముడు దర్శనమిస్తారు.
7/10కనక్‌ భవన్‌లో సీతారామస్వాములు
8/10పంజాబ్ అమృత్ సర్లో శ్రీరామ తీర్థ ఆలయం కొలువై ఉంది. అమృత్సర్కి పశ్చిమాన 11 కిలోమీటర్ల దూరంలో అమృత్సర్ లోపోకే రహదారిపై ఉంది. రామాయణకాలం సమయంలో భగవాన్ వాల్మీకి ఇక్కడి ఆశ్రమంలో ఉండేవారని స్థల పురాణం చెబుతున్నది. ఇక్కడే కొంతకాలం సీతమ్మవారు ఉన్నారని.. ఈ ప్రదేశంలోనే లవకులు జన్మించిన ప్రదేశం సైతం ఇదేనని చరిత్ర చెబుతున్నది.
9/10రామస్వామి దేవాలయం, చిక్కమగళూరు  కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో కోదండ రామస్వామి దేవస్థానం ఉన్నది. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. హిరమగళూరులో పరశురాముడు తన వివాహం వేడుకను చూపించాడని రాముడిని కోరాడని స్థలపురాణం చెబుతున్నది. కోదండ రాముడి విగ్రహానికి కుడి వైపున సీతమ్మ, ఎడమ వైపున లక్ష్మణుడి విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ సిద్ధ పుష్కరణి అని పిలిచే చెరువు ఉంటుంది. ఇక్కడ తొమ్మిది సిద్ధులు నివాసం ఉండేవారు. అలాగే పరశురాముడు సైతం ఇక్కడ నివసించినందుకు దీన్ని భార్గవపురి లేదంటే భార్గవ పట్టణంగా పురాణాలు పేర్కొన్నాయి.
10/10కుంభకోణం రామస్వామి దేవాలయం, తమిళనాడు  రామస్వామి దేవాలయం తమిళనాడు కుంభకోణంలో ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ అయోధ్యగా పిలుస్తుంటారు. ఎక్కడైనా ఆలయాల్లో సీతారాములతో పాటు ఆయన లక్ష్మణుడు కనిపిస్తుంటాడు. ఈ కానీ భరతుడు, శత్రుజ్ఞులు విగ్రహాలు సైతం ప్రతిష్ఠించబడ్డ ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయం కావేరీ నది ఒడ్డున ఉంటుంది. ఈ ఆలయం తంజావూరు నాయక రాజు అచ్యుతప్ప నాయక్ (1560-1614) కాలంలో ప్రారంభించగా.. రఘునాథ నాయక్ (1600-34) పాలనలో పూర్తి అయ్యింది.