న్యూఢిల్లీ, మే 25: మతపరమైన అంశాలను ముడిపెట్టి ఈ ఎన్నికల్లో విపక్షాలపై తీవ్ర విమర్శలకు పాల్పడుతున్న ప్రధాని మోదీ.. విమర్శ సరైన రీతిలో ఉండాలని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఈ ఎన్నికల్లో విపక్షాల నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కొంటున్న ఆయన తన పదేండ్ల పాలనలో పటిష్టమైన ప్రతిపక్షాన్ని చూడలేకపోయానన్నారు.
సీఎన్ఎన్-18 న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రజా జీవితంలో పలికే మాటలకు హద్దులు ఉండాలని, సరసమైన పదాలను వాడితే బాగుంటుందని సూచించారు. తన పదవీ కాలంలో కాంగ్రెస్ నుంచి ఎలాంటి సానుకూల భాగస్వామ్యాన్ని పొందలేకపోయానన్నారు.