న్యూఢిల్లీ: మోదీ సర్కార్ కొత్త ఆరోగ్య స్కీమ్ను ప్రకటించనున్నది. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ను .. సెప్టెంబర్ 27వ తేదీన ప్రధాని మోదీ ప్రకటించనున్నారు. గతంలో ఇదే స్కీమ్ను నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అని పిలిచేవాళ్లు. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ కింద యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇవ్వనున్నారు. చాలా పటిష్టమైన, సురక్షితమైన, సులువైన రీతిలో ఆరోగ్య సేవలు ఉండనున్నాయి. పీహెచ్-డీహెచ్ఎం స్కీమ్ కింద ప్రతి ఒకరికి డిజిటల్ హెల్త్ ఐడీలను ఇస్తారు. ఆ ఐడీల్లో ఆ వ్యక్తి సమగ్ర ఆరోగ్యం సమాచారం ఉంటుంది. ఆధార్, మొబైల్ నెంబర్తో ఆ ఐడీని అటాచ్ చేస్తారు. ప్రస్తుతం పీఎం-డీహెచ్ఎం స్కీమ్ను పైలట్ ప్రాజెక్టుగా అండమాన్ నికోబార్, చండీఘడ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయూ, లడాఖ్, లక్షద్వీప్, పుదుచ్చరిల్లో నిర్వహిస్తున్నారు. దేశంలోని ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకే ఈ కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టిన ఓ అధికారి తెలిపారు.