న్యూఢిల్లీ: ట్రక్కుపై తరలిస్తున్న విమానం ఓ బ్రిడ్జ్ కింద ఇరుక్కపోయింది(Plane Struck). దీంతో బీహార్లోని మోతిహరి ప్రాంతంలో శుక్రవారం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్క్రాప్ కింద తీసివేసిన ఆ విమానాన్ని ముంబై నుంచి అస్సాం తరలిస్తున్న సమయంలో పిప్రకోతి వద్ద ఆగిపోయింది. అక్కడ ఉన్న బ్రిడ్జ్ కింద నుంచి ఆ విమానాన్ని తీసుకెళ్తుంటే అది బ్రిడ్జ్కు తట్టుకున్నది. దీంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ఇక వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్డు మూసుకుపోవడంలో మరో దారి ద్వారా ప్రయాణికులు వెళ్లారు. జాతీయ రహదారి 27పై ఈ ఘటన జరిగింది. పిప్రకోతి బ్రిడ్జ్ ఎత్తును ట్రక్కు డ్రైవర్ సరిగా అంచనా వేయలేకపోయాడని, అందుకే ట్రక్కు మీద ఉన్న విమానం ఇరుక్కపోయినట్లు అధికారులు తెలిపారు.
Plane struck under bridge in Bihar
But why??
pic.twitter.com/rmnGD1gzmY— R a J i V (@RajivAluri) December 30, 2023