విందులు, చిందులు అంటే ఇష్టపడని వారుండరు. అందుకే పార్టీలలో చాలాసార్లు పరిచయం లేని వాళ్లని సైతం చూస్తూ ఉంటాం. అయితే ఇలాగే ఇటీవల జరిగిన ఒక పార్టీలో ఒక వింత సంఘటన జరిగింది. వచ్చిన అతిథులందరికీ రకరకాల వంటలు పెట్టారు. మనసుకు నచ్చినంత తినొచ్చని చెప్పి.. తీరా అందరూ తినేసిన తరువాత ఒక్కసారిగా పెద్ద షాకిచ్చారు.
పార్టీ ఇచ్చిన వ్యక్తి అక్కడున్న వారందరినీ పిలిచి తిన్నందుకు ప్రతి ఒక్కరూ రూ.4,500 ఇవ్వాలని అడిగారు. దీంతో గెస్ట్లందరూ ఒక్కసారిగా షాకయ్యారు. డబ్బులు చెల్లించమనండంతో అందరికీ తిన్నదంతా అరిగిపోయింది. ఈ సంఘటన ఇంగ్లాండ్లో జరిగింది.
ఇటీవల ఓ ఇంగ్లాండ్ మహిళ తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె పోస్ట్లో తన అనుభవం గురించి రాస్తూ.. ‘‘పండుగ సందర్భంగా మా బంధువుల్లో ఒకరు నన్ను భోజనానికి పిలిచారు. కానీ, విందు పూర్తయిన తరువాత తిన్న ఫుడ్కి బిల్లు ఇచ్చారు. పార్టీకి వచ్చిన అతిథులందరినీ బిల్లు అడగడంతో అందరం షాక్ అయ్యాం. ఇది మరీ దారుణం అనిపించింది. కానీ, వారు బిల్ చెల్లించమని అడిగింది ఒక సమాజసేవ కార్యక్రమం కోసం కావడంతో ఏ ఒక్కరూ వారి నిర్ణయాన్ని తప్పుపట్టలేదు. ప్రతి అతిథి విందు కోసం రూ. 4,500 చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ఇంటి నుంచి పార్టీ వేదిక వద్దకు చేరుకోవడానికి డబుల్ మనీ ఖర్చు అయింది.’’ అని చెప్పుకొచ్చింది ఆ మహిళ.
కాగా, ఆ మహిళ పెట్టిన పోస్ట్పై నెటిజన్లు తమ తమ స్టైల్లో అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది ఈ పద్ధతిని తప్పు పడుతుండగా.. మరికొందరు దీన్ని సమర్థిస్తున్నారు. ఇంకా కొందరైతే ఈ బిజినెస్ ఏదో బాగుందే అంటూ సెటైర్లు వేస్తున్నారు.