Islamabad | ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై పాక్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్ప కూలిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఓ ఆమ్ఆద్మీ పార్టీని పోలిన ఓ పార్టీ ఉద్భవించింది. మాజీ సైనికాధికారి జసాద్ ఖట్టక్ నేతృత్వంలో ఓ పార్టీ పురుడు పురుడు పోసుకుంది. దాని పేరు ‘పాకిస్తాన్ ఆమ్ ఆద్మీ మూవ్మెంట్’ (పీఏఏమ్). ఈ సందర్భంగా జసాద్ ఖట్టక్ మాట్లాడుతూ.. భూస్వామ్య రాజకీయ విధానాలను పాతరేసి, సామాన్యులను రాజకీయ పీఠాలకు దగ్గర చేయడమే తమ పార్టీ లక్ష్యమని వివరించారు.
జసాద్ ఖట్టక్ ‘పాకిస్తాన్ఆమ్ఆద్మీ మూవ్మెంట్’ అనే పార్టీని 2021 నవంబర్లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ నెల 16న కరాచీ వేదికగా పార్టీని ప్రకటించారు. న్యాయ వ్యవస్థ న్యాయాన్ని అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. భూస్వామ్య, కుటుంబ, పెట్టుబడిదారులను తొలగించి, సామాన్యులను అధికార పీఠాలపై కూర్చోబెట్టే సమయం ఆసన్నమైందన్నారు.